యాప్నగరం

ఢిల్లీ- విజయవాడ విమానంపై పిడుగు.. పలువురికి గాయాలు

విజయవాడ వస్తున్న విమానం పిడుగు ప్రభావానికి గురైంది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. పలువురు క్రూ సిబ్బంది గాయపడ్డారు. పిడుగు కారణంగా విమానం దెబ్బతింది.

Samayam Telugu 22 Sep 2019, 12:34 am
హైదరాబాద్: ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిరిండియా చెందిన విమానం పిడుగు ప్రభావానికి గురైంది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విమానం క్రూ సిబ్బందిలో పలువురు గాయపడ్డారు. పిడుగు కారణంగా విమానం దెబ్బ తిన్నట్లు అధికారులు వెల్లడించారు.
Samayam Telugu flight


ఎయిరిండియాకు చెందిన AI-467 నంబర్ విమానం శనివారం (సెప్టెంబర్ 21) రాత్రి 7.28 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. ఇది 9.40 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంది. అయితే.. టేకాఫ్ అయిన కాసేపటికే ఉరుములు, పిడుగుల వర్షంలో చిక్కుకున్న విమానం.. పిడుగు ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.

Don't Miss: మెట్రో రైల్లో హంగామా చేసిన మందుబాబును టెక్నాలజీ పట్టించిందిలా..

విమానంపై పిడుగు పడకున్నా.. ఉరుములతో కూడిన వర్షంలోని పిడుగుపాటు ప్రభావానికి గురైనట్ల తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిరిండియా విచారణకు ఆదేశించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఆ వ్యాధే శాపమైంది.. మేడ్చల్ యువకుడి సజీవదహనం వెనుక చేదు నిజం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.