తెలంగాణలోని కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితులపై బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సహా సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కూడా హాజరయ్యేందుకు ప్రగతి భవన్కు వచ్చారు. కానీ, ఆయన్ను భద్రతా సిబ్బంది లోనికి అనుమతించలేదు. భేటీకి అనుమతి లేదని సిబ్బంది తేల్చి చెప్పడంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ భేటీలో పాల్గొనేందుకు అనుమతి లభించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి కూడా అయిన మహమూద్ అలీకి ఆ భేటీలో పాల్గొనేందుకు ఎందుకు అవకాశం ఇవ్వలేదనే చర్చ మొదలైంది. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Samayam Telugu1 Apr 2020, 10:15 pm
తెలంగాణలోని కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితులపై బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సహా సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కూడా హాజరయ్యేందుకు ప్రగతి భవన్కు వచ్చారు. కానీ, ఆయన్ను భద్రతా సిబ్బంది లోనికి అనుమతించలేదు. భేటీకి అనుమతి లేదని సిబ్బంది తేల్చి చెప్పడంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ భేటీలో పాల్గొనేందుకు అనుమతి లభించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి కూడా అయిన మహమూద్ అలీకి ఆ భేటీలో పాల్గొనేందుకు ఎందుకు అవకాశం ఇవ్వలేదనే చర్చ మొదలైంది. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కారణాలివేనా..
ప్రగతి భవన్ లోపలికి వెళ్లకుండా డిప్యూటీ సీఎంను భద్రతా సిబ్బంది ఆపేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అయితే, హోం మంత్రి అనుకోకుండా అక్కడికి వచ్చారని ఆయన కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. కానీ, హోంశాఖ మంత్రి కింద పని చేసే రాష్ట్ర డీజీపీని ఈ సమీక్షకు అనుమతివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన తెలంగాణ యాత్రికుల వల్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ అంశంపైనే చర్చ జరుగుతుంది కాబట్టి.. అదే సామాజికవర్గానికి చెందిన హోం మంత్రి సమావేశంలో లేకపోవడం మంచిదనే అభిప్రాయంతోనే అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
నిజాముద్దీన్లోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారిలో హైదరాబాద్ నుంచి పాత బస్తీకి చెందిన వారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మహమూద్ అలీ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం వల్లే అనుమతించడం లేదని అంటున్నారు. అయితే సీఎం నిర్వహిస్తున్న సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. మర్కజ్ యాత్రికులను గుర్తించడం. దానికి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. యాత్రలో పాల్గొన్న వారిని ఎంతమందిని గుర్తించారు? గుర్తించిన వారిలో క్వారంటైన్కు తరలించారా? పాజిటివ్ కేసులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై కేసీఆర్ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
మరోక వాదనా వినిపిస్తోంది. మర్కజ్లో జరిగిన ప్రార్థనలకు సంబంధించి సమాచారం డిప్యూటీ సీఎం వద్ద ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే, ఆ యాత్రకు పాత బస్తీ ప్రాంతం నుంచి ఎవరెవరు వెళ్లారు? ఎలా వెళ్లారు? ఇంతమందిని అక్కడికి ఎలా తీసుకెళ్లారు? వంటి సమాచారంలో కొంతైన ఆయనకు కచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి ఇలాంటప్పుడు సమావేశంలో పాల్గొని ఉంటే ఆయన నుంచి మరింత సమాచారం వచ్చే ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సమాచారం కీలకంగా మారేది. ఏది ఏమైనప్పటికీ ఉప ముఖ్యమంత్రిని వెనుదిరిగేలా చేయడంపై ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.