యాప్నగరం

లాక్‌డౌన్‌లో భారీగా సైబర్ నేరాలు.. అడ్డుకట్టకు స్పెషల్ ప్రోగ్రాం: డీజీపీ

Telangana DGP: తెలంగాణ మహిళా భద్రతా విభాగం నిర్వహిస్తున్న ఈ ప్రచారానికి యునిసెఫ్ ఇండియా అవసరమైన సహకారాన్ని అందిస్తోందని డీజీపీ చెప్పారు. ఆన్‌లైన్ ముప్పు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మహిళలు, పిల్లలకు అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

Samayam Telugu 15 Jul 2020, 3:49 pm
కరోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌లో సైబ‌ర్ నేరాలు బాగా పెరిగాయని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో మహిళలు, పిల్లల కోసం సురక్షితమైన సైబర్ ప్రపంచం లక్ష్యంగా నెల రోజుల పాటు జరిగే ఆన్‌లైన్ ప్రచారం ‘సైబ్ హ‌ర్’ అనే కార్యక్రమాన్ని డీజీపీ బుధవారం ఆన్‌లైన్ వేదికగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సైబర్ నేరాలు జరిగే తీరు, జాగ్రత్తగా ఉండాల్సిన చర్యల గురించి ఇంటర్నెట్ వినియోగదారులకు మరింత అవగాహన కలిగించేలా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
Samayam Telugu లాక్‌డౌన్‌లో భారీగా సైబర్ నేరాలు.. అడ్డుకట్టకు స్పెషల్ ప్రోగ్రాం: డీజీపీ
Telangana DGP


తెలంగాణ మహిళా భద్రతా విభాగం నిర్వహిస్తున్న ఈ ప్రచారానికి యునిసెఫ్ ఇండియా అవసరమైన సహకారాన్ని అందిస్తోందని డీజీపీ చెప్పారు. ఆన్‌లైన్ ముప్పు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మహిళలు, పిల్లలకు అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యాస ర‌చ‌న‌, గ్రూప్ డిస్కషన్స్ వంటి ఇత‌ర కార్యక్రమాలను సైతం చేపడతామని డీజీపీ వెల్లడించారు. క్రీడ‌లు, సినిమా రంగం, న్యాయ రంగం, సైకాల‌జిస్టులు, సైబ‌ర్ క్రైం నిపుణులు, విద్యార్థులు ఈ సైబ్ హర్ ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.