యాప్నగరం

తెలంగాణలో నేటి నుంచి ధరణి రిజిస్ట్రేషన్లకు బ్రేక్

ఇవాల్టి నుంచి 21 వ తేదీ వరకు తెలంగానలో రిజిస్ట్రేషన్లు ఉండవని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. అన్ని మండల కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసినట్లు ఆయన ప్రకటించారు.

Samayam Telugu 13 May 2021, 9:47 am

ప్రధానాంశాలు:

  • కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం నిర్ణయం
  • అన్ని మండల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు బంద్
  • స్లాట్ బుక్ చేస్తే 21 తర్వత రీ షెడ్యూల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu నిలిచిన ధరణి రిజిస్ట్రేషన్లు
తెలంగాణలో ధరణి రిజిస్ట్రేషన్లకు మరోసారి బ్రేక్ పడింది. కరోనా కట్టడి భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి నుంచి 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు ఉండవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమౌతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్ని మండల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
స్లాట్లు బుక్‌ చేసుకున్న వారికి 21 తర్వాత రీషెడ్యూల్‌ చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఒక్క రిజిస్ట్రేషన్ చేయాలంటే కార్యాలయంలో నలుగురు లేదా ఐదుగురు అవసరం ఉంటుంది. క్రయ విక్రయదారులు, సాక్షులు ఇతరులు రావడంతో కార్యాలయాల్లో రద్దీగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో కరోనా సోకే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎస్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ అనంతరం వీటిపై మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రజలెవరూ తహశీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లకు రావొద్దని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.