యాప్నగరం

Dharmapuri Arvind: ఎమ్మెల్సీ కవితపై హైకోర్టుకెళ్లిన ఎంపీ ధర్మపురి అర్వింద్.. చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్

Dharmapuri Arvind: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటనకి సంబంధించి ఇంకా రచ్చ కొనసాగుతోంది. ఈ ఘటన జరిగి చాలా రోజులు గడిచినా.. ఇంకా వివాదం ముగిసిపోలేదు. ఈ అంశం వేదికగా ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. తనను చంపేస్తానంటూ కవిత చేసిన పరుష వ్యాఖ్యలపై హైకోర్టును అర్వింద్ ఆశ్రయించారు. కవితపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 29 Nov 2022, 1:24 pm

ప్రధానాంశాలు:

  • దాడి ఘటనపై హైకోర్టులో ధర్మపురి అర్వింద్ పిటిషన్
  • కవితపై చర్యలు తీసుకోవాలంటూ విన్నపం
  • చంపేస్తానని బెదిరించారంటూ పిటిషన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Arvind and Kavitha
అర్వింద్, కవిత
Dharmapuri Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య వార్ కొనసాగుతోంది. తనపై జరిగిన దాడి ఘటనపై హైకోర్టును ఎంపీ అర్వింద్ ఆశ్రయించారు. దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను చంపుతానంటూ మీడియా వేదికగా బహిరంగంగా కామెంట్లు చేసిన కవితపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు.
ధర్మపురి అర్వింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశముంది. తాను ఇంట్లో లేని సమయంలో హైదరాబాద్‌లోని తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. తన ఇంట్లో అద్దాలు, ఫర్నీచర్, వస్తువులు పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపారు. దాడికి పాల్పడ్డ వారితో పాటు తనను చంపేస్తానంటూ వ్యాఖ్యలు చేసిన కవితపై పోలీసులు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

గత కొద్దిరోజుల క్రితం కవితపై ధర్మపురి అర్వింద్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అర్వింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లోని ఫర్నీచర్‌ను పూర్తిగా దాడి చేశారు. ఈ ఘటన జరుగుతుండగానే కవిత ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి అర్వింద్‌పై విరుచుకుపడ్డారు. అర్వింద్‌ను నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ ఘాటుగా స్పందించారు. అర్వింద్‌ను చంపేస్తామంటూ కవిత పరుష పదజాలంతో మాట్లాడారు.

దాడి జరుగుతున్న సమయంలో ఇంట్లో అర్వింద్ తల్లి ఉన్నారు. దీంతో తమ ఇంటిపై జరిగిన దాడి ఘటనపై బంజారాహిల్స్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో అర్వింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డ పలువురు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగలేదు. తన ఇంటిపై దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎంపీగా ఉన్న తన ఇంటిపై దాడి జరిగితే పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.