యాప్నగరం

సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు బ్రేక్!

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు మరోసారి బ్రేకులేసింది. పీఎల్ విశ్వేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం జులై 13 వరకు సచివాలయ భవనాలను కూల్చొద్దని ఆదేశించింది.

Samayam Telugu 10 Jul 2020, 1:39 pm
సచివాలయ భవనాల కూల్చివేత విషయమై హైకోర్టు మరోసారి తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చింది. సోమవారం వరకు కూల్చివేతను నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నగరానికి చెందిన సామాజికవేత్త పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. సచివాలయ కూల్చివేతను ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Samayam Telugu telangana secretariat


పాత సచివాలయ భవనాల కూల్చివేతకు జూన్ చివర్లో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వెంటనే స్పందించిన కేసీఆర్ సర్కారు పాత భవనాలను కూల్చివేసే ప్రక్రియను మూడు రోజుల క్రితం ప్రారంభించింది. ఇందుకోసం సచివాలయం వైపు వెళ్లే దారులను మూసివేయడంతోపాటు.. పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా వరకు సచివాలయ భవనాల కూల్చివేత పూర్తయ్యింది.

ఇప్పటికే నూతన సచివాలయ నమూనాను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రూ.500 కోట్లతో కొత్త సచివాలయం నిర్మాణ పనులను శ్రావణ మాసంలో ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది.

Read Also: సచివాలయ శిథిలాలతో దెబ్బతిన్న గుడి, మసీదు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.