యాప్నగరం

తెలంగాణ సర్కార్‌పై రఘునందన్ రావు ఫిర్యాదు.. ఈసీ, అమిత్ షాకు లేఖ

Dubbaka Bypoll: సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేర‌కే తెలంగాణ పోలీసు విభాగం తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని కేంద్రాన్ని కోరారు.

Samayam Telugu 7 Oct 2020, 5:57 pm
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ తరపుణ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. త‌న ఫోన్లు సహా సిబ్బంది ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తుందంటూ ఆయన కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేర‌కే తెలంగాణ పోలీసు విభాగం తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని ర‌ఘునంద‌న్ రావు కేంద్రాన్ని కోరారు.
Samayam Telugu రఘునందన్ రావు (ఫైల్ ఫోటో)
raghunandan


అక్టోబ‌ర్ 5న జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ద్వారా తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే విషయం రుజువ‌య్యింద‌ని ఆయన వెల్లడించారు. వెంట‌నే ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచార‌ణ చేయాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని ర‌ఘునంద‌న్ రావు కోరారు. మరోవైపు, మంగళవారం హైదరాబాద్ శివారులో పోలీసులు భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న సొమ్ము గుర్తించిన సంగతి తెలిసిందే. వారిని విచారణ జరపగా రఘునందన్ రావు అనుచరులమని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.