యాప్నగరం

కాపలా కుక్కలా ఉంటానన్నారు.. కేసీఆర్‌పై దుబ్బాక ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బీజేపీ, టీఆర్ఎస్‌ మధ్య గ్రేటర్ ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. రెండు పార్టీలు ప్రచారంలో జోరుగా పాల్గొని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

Samayam Telugu 26 Nov 2020, 7:41 am
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో నాయకులు ఒకరిపై ఒకరు విమర్శల దాడులు చేసుకుంటున్నాయి. ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గ్రేటర్‌లో ప్రచారం నిర్వహించారు. నాచారం డివిజన్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా రఘునందన్ ప్రచారం చేశారు. కేసీఆర్ బీజేపీ పై యుద్ధం ప్రకటిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారాయన. అధికారమిచ్చిన ప్రజలకు సేవలందించకుండా.. ఎప్పుడూ ఫామ్ హౌస్ లో ఉండే కేసీఆర్ బీజేపీ పై యుద్ధం ఎలా చేస్తారని ప్రశ్నించారు.
Samayam Telugu దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
dubbaka bjp mla raghunandan rao


Read More: అక్కడ అల్లర్లకు భారీ ప్లాన్.. ఎన్నికల వాయిదాకు కుట్ర.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రం నిధులివ్వకుండా రాష్ట్రంలో జాతీయ రహదారులు ఎక్కడినుండి వచ్చాయో చెప్పాలన్నారు రఘునందన్. TRS పార్టీ లాగా బీజేపీ టిక్కెట్లు అమ్ముకోదన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల వచ్చిన వరదలపై కూడా రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్.. హైదరాబాద్ లో వరద వచ్చి జనం అవస్థలు పడుతుంటే ఎక్కడున్నాడని ప్రశ్నించారు ఎమ్మెల్యే రఘునందన్. టీఆర్ఎస్, ఎంఐఎం రెండు వేర్వరు కాదని రెండు ఒక్కటేనన్నారు. ఈ రెండు పార్టీల్లో దేనికి ఓటు వేసినా ఒక్కటేనన్నారు రఘునందన్. హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అన్నారాయన. గ్రేటర్‌లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.