యాప్నగరం

24 గంటల్లో దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం.. కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లు లెక్కించనున్నారు.

Samayam Telugu 9 Nov 2020, 1:39 pm
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఈనెల 10న రానుంది. మంగళవారం కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. సిద్దిపేట ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. 1453 పోస్టల్ బ్యాలెట్, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయి.
Samayam Telugu దుబ్బాక కౌంటింగ్
dubbaka result tomorrow


Read More
:మంచినీరు తాగి 11మందికి అస్వస్థత.. ఒకరు మృతి

మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ విధుల్లో 200 మంది సిబ్బంది పాల్గొనున్నారు. ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు పోటీ చేసిన విషయం విదితమే. దుబ్బాకలో మొత్తం ఓట్లు 198756 కాగా.. పోలైన ఓట్లు164192. అంటే.. 82.61 పోలింగ్ శాతం జరిగిందన్న మాట. దుబ్బాకలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈనెల 3న దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే.

2018లో టిఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కరోనాతో మరణించడంతో ఈ ఎన్నిక జరిగింది.టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి భార్య సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన రావు, కాంగ్రెస్ నుంచి చెఱకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి సహా 23 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. నియోజకవర్గంలో దుబ్బాక పట్టణం, ఏడు మండలాలు, 146 గ్రామాల్లో కలపి మొత్తం లక్షా 98 వేల 756 మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగు జరుగగా, మొత్తం 81.4 శాతం ఓట్లు నమోదయ్యాయి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.