యాప్నగరం

దుబ్బాక ఉపఎన్నిక: భారీగా డబ్బు తరలింపు.. వివాదంలో బీజేపీ అభ్యర్థి

Dubbaka By Poll: మంగళవారం సాయంత్రం శామీర్‌పేటలో రూ.40 లక్షల అక్రమ సొమ్ముతో కొంతమంది వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీసులుకు చిక్కిన నలుగురు వ్యక్తులను డీసీపీ పద్మజ విచారణ జరిపారు.

Samayam Telugu 6 Oct 2020, 10:22 pm
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాధవనేని రఘునందన్‌ రావు ఎన్నికల ముందే ఓ వివాదంలో చిక్కుకున్నారు. అతని అనుచరుల వద్ద పోలీసులు భారీగా సొమ్మును పట్టుకున్నారు. హైదరాబాద్‌ పోలీసుల సమాచారం మేరకు.. మంగళవారం సాయంత్రం శామీర్‌పేటలో రూ.40 లక్షల అక్రమ సొమ్ముతో కొంతమంది వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీసులుకు చిక్కిన నలుగురు వ్యక్తులను డీసీపీ పద్మజ విచారణ జరిపారు. దీంతో వారు ఆ డబ్బును రఘునందన్‌ రావుకు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
Samayam Telugu ఎన్నికల ప్రచారంలో రఘునందన్ రావు
Dubbaka by poll


పటాన్‌చెరు నుంచి సిద్దిపేటకు డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నామని డీసీపీ పద్మజ వెల్లడించారు. నిందితులతో రఘునందన్‌రావు పీఏ సంతోష్‌ ఫోన్‌ సంభాషణను కూడా తాము గుర్తించినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు తరలిస్తున్న నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతుండగా బీజేపీకి అభ్యర్థికి సంబంధించిన అనుచరుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బు బయట పడడం సంచలనంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.