యాప్నగరం

కార్పొరేటర్ ఇంట్లో విందు ఆరగించిన.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

మీర్ పేట్ కార్పొరేటర్ బాలకృష్ణ ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. అక్కడ పలువురితో కలిసి ఆయన టీ తాగి టిఫిన్ కూడా చేశారు.

Samayam Telugu 14 Dec 2020, 11:43 am
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఓ కార్పొరేటర్ ఇంట్లో సందడి చేశారు. సోమవారం పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇవాళ ఉదయం వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలకు హాజరయ్యారు. దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందాలంటూ అహర్నిశలు కృషి చేసిన అభిమానుల కోరక మేరకు రఘునందనరావు పూజలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీర్‌పేట్ కార్పొరేషన్ 37వ డివిజన్ కార్పొరేటర్ మోడల్ బాలకృష్ణ.. ఎమ్మెల్యేను తన ఇంటికి ఆహ్వానించారు. దీంతో ఆయన ఆహ్వానం మేరకు రఘునందనరావు మర్యాదపూర్వకంగా వారిని కలిశారు.
Samayam Telugu కార్పొరేటర్ ఇంట్లో దుబ్బాక ఎమ్మెల్యే


Read More: Dirty Hari: హాఫ్ న్యూడ్‌గా హీరో, హీరోయిన్లు.. హైదరాబాద్ మెట్రో పిల్లర్‌పై డర్టి పోస్టర్

కార్పొరేటర్ ఇంట్లో తేనీరు తీసుకొని, అల్పాహార విందును ఆరగించారు. అనంతరం ఆయన కార్పొరేటర్ బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అందెల శ్రీ రాములు యాదవ్, స్థానిక కార్పొరేటర్లు లీల రవి నాయక్, చెవ్వ మన్నెమ్మ శ్రవణ్ కుమార్, గిరిజన ఎస్‌టిసెల్ ప్రెసిడెంట్ రమావత్ శ్రీను నాయక్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తన ఇంట్లో ఇలా బ్రేక్ ఫాస్ట్ చేయడంతో కార్పొరేటర్ బాలకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు గెలుపొందిన విషయం తెలసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.