యాప్నగరం

ముగిసిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి అంత్యక్రియలు.. కన్నీటితో నేతల వీడ్కోలు

Chittapur: మధ్యాహ్నం 3 గంటలకు చిట్టాపూర్‌లోని రామలింగారెడ్డి స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. రామలింగారెడ్డి వ్యవసాయ క్షేత్రంలోనే ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Samayam Telugu 6 Aug 2020, 7:57 pm
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో రామలింగారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వం నిర్వహించింది. గురువారం మధ్యాహ్నం రామలింగారెడ్డి భౌతికకాయం వద్ద సీఎం కేసీఆర్ నివాళులు అర్పిస్తూ కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. రామలింగారెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు. మధ్యాహ్నం 3 గంటలకు చిట్టాపూర్‌లోని రామలింగారెడ్డి స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. రామలింగారెడ్డి వ్యవసాయ క్షేత్రంలోనే ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. రామలింగారెడ్డి అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య అధికారిక లాంఛనాలతో అత్యక్రియలు జరిగాయి.
Samayam Telugu పాడె మోస్తున్న మంత్రి హరీష్ రావు
dubbaka mla ramalinga reddy funeral took place in chittapur


తమ ప్రియతమ నాయకుడి చివరి చూపు కోసం అభిమానులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. రామలింగారెడ్డి అంతిమ యాత్రలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాడె మోస్తూ ముందు నడిచారు. అంత్యక్రియల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.