యాప్నగరం

4 రోజుల్లో దిమ్మతిరిగేలా లిక్కర్ సేల్స్.. రోజురోజుకూ సరికొత్త రికార్డ్

coronavirus lockdown: ఇతర రాష్ట్రాలలో మద్యం రేట్లను పెంచినట్లుగానే తెలంగాణలోనూ పెంచి ఉంటే కలెక్షన్ మరింతగా ఉండే అవకాశం ఉండేది. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు ప్రభుత్వం అంతగా పెంచకపోవడం కూడా అమ్మకాలకు ఊతం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Samayam Telugu 9 May 2020, 10:39 pm
లాక్‌ డౌన్‌ వల్ల దాదాపు నెలన్నర మూత పడ్డ మద్యం షాపులు తెరవడంతో అమ్మకాల కలెక్షన్ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచి ఇప్పటికే నాలుగు రోజులు గడుస్తోంది. ఈ నాలుగు రోజుల్లో ఏకంగా రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లుగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. శనివారం ఒక్కరోజే మద్యం డిపోల నుంచి రూ.149 కోట్ల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


గత నాలుగు రోజుల్లో మే 6న రూ.72.5 కోట్లు, మే 7వ తేదీన ఇంకా ఎక్కువగా 188.2 కోట్లు, మే 8న డిపోల నుంచి రూ. 190.47 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైన్స్ షాపులు తిరిగి ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే తెలంగాణలో మద్యం అమ్మకాలు రూ.600 కోట్లకు చేరుకున్నాయి.

Also Read: undefined

ఇతర రాష్ట్రాలలో మద్యం రేట్లను పెంచినట్లుగానే తెలంగాణలోనూ పెంచి ఉంటే కలెక్షన్ మరింతగా ఉండే అవకాశం ఉండేది. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు ప్రభుత్వం అంతగా పెంచకపోవడం కూడా అమ్మకాలకు ఊతం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో మద్యం ధరలను 75 శాతం పెంచిన సంగతి తెలిసిందే. అదే తెలంగాణలో మాత్రం మద్యం ధరల పెంపు చీప్ లిక్కర్‌పై 11 శాతం.. ఖరీదైన మద్యంపై 16 శాతం పెంచారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.