యాప్నగరం

తెలంగాణ ఈ-ఆఫీస్ పాలన షురూ.. లాభాలేంటంటే..

ఈ-ఆఫీస్ కొత్త విధానం ద్వారా ప్రస్తుతం 1,600 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని సీఎస్ వివరించారు. ప్రతి దరఖాస్తు, పరిష్కారానికి జవాబుదారీతనం ఏర్పడుతుందని చెప్పారు.

Samayam Telugu 19 Jul 2020, 7:59 am
తెలంగాణలో ఈ-ఆఫీస్ ద్వారా పాలన ప్రారంభమైంది. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ విధానం ఎంతో తోడ్పడనుంది. రాష్ట్రంలో తొలివిడతలో సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ), అబ్కారీ, వాణిజ్యపన్నులు, ప్రధాన కమిషనర్‌, భూపరిపాలనశాఖల్లో ఈ-ఆఫీస్‌ విధానాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడారు. ఈ-ఆఫీస్ కొత్త విధానం ద్వారా ప్రస్తుతం 1,600 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని సీఎస్ వివరించారు. ప్రతి దరఖాస్తు, పరిష్కారానికి జవాబుదారీతనం ఏర్పడుతుందని చెప్పారు. జాప్యానికి తావులేకుండా పౌరులకు సత్వర, మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. మిగతా శాఖలు కూడా త్వరగా ఈ ఆఫీసు సేవలు ప్రారంభించాలని సూచించారు.
Samayam Telugu తెలంగాణలో ఈ-ఆఫీస్ పాలన షురూ
telangana e office


సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌ నీతూకుమారిప్రసాద్‌, ప్రొహిబిషన్‌, ఎస్సీ డెవలప్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌అహ్మద్‌, మహిళా,శిశుసంక్షేమశాఖ కార్యదర్శి దివ్య, ఫైనాన్స్‌ సెక్రటరీ రొనాల్డ్‌రాస్‌, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ రజత్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఈ-పాలన ఇలా..
పరిపాలనలో పారదర్శకత, ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. కార్యాలయాల్లో కాగితాలతో పని లేకుండా ఉంటుంది. ఆలస్యం, అలసత్వానికి తావులేకుండా ఈ- ఆఫీస్‌ ఉపకరిస్తుంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచే సమస్త సమాచారాన్ని కంప్యూటరీకరించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగానే భూ రికార్డులన్నింటినీ ప్రక్షాళనచేసి కంప్యూటరీకరించారు. ఇంటర్నెట్‌లో భూములకు చెందిన సమస్త వివరాలు అందులో ఉంటాయి. ఏ భూమి ఎవరికి ఏ విధంగా వచ్చిందనే వివరాలను కూడా పొందుపరిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.