యాప్నగరం

వృద్ధ దంపతుల సజీవ దహనం.. కొడుకు కిరాతకమేనా?

Warangal రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు మంటల్లో సజీవ దహనమయ్యారు. వారి కుమారుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు.

Samayam Telugu 30 Oct 2019, 10:42 pm
రంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలంలో దారుణం చోటు చేసుకుంది. మడిపల్లి శివారు గేట్ తండాలో వృద్ధ దంపతులు ఇంట్లోనే సజీవ దహనమయ్యారు. ఆ దంపతుల కొడుకు వారిని సజీవ దహనం చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu fire


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం (అక్టోబర్ 30) రాత్రి తండాకు చెందిన ఓ ఇంట్లో నుంచి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. తండావాసులు పరుగెత్తికెళ్లి చూడగా.. భూక్య ధస్రు (68), బాజు(65) అనే దంపతులు మంటల్లో ఆర్తనాదాలు చేస్తూ సజీవ దహనమయ్యారు.

తండావాసులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. నెక్కొండ ఎస్‌ఐ నవీన్ కుమార్ ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: డ్రైవర్‌కు గుండెపోటు.. ఆర్టీసీ సమరభేరిలో విషాదం

వృద్ధ దంపతుల ఇల్లు అగ్నికి ఆహుతైపోయింది. దంపతులు మంటల్లో కాలిపోతుండగా చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనతో తండాలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.