యాప్నగరం

అక్టోబరు 21న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక.. అన్ని పార్టీల్లోనూ కాక!

గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో హుజూర్‌నగర్ స్థానాన్నికోల్పోయామని, దీనికి ట్రక్కు గుర్తు కూడా కారణమంటోంది అధికార టీఆర్ఎస్. ఈసారి పక్కగా గెలువు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.

Samayam Telugu 21 Sep 2019, 5:41 pm
మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీలతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 64 శాసనసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ వెల్లడించింది. తెలంగాణలోని హుజూర్‌నగర్ అసెంబ్లీకి కూడా అక్టోబరు 21నే ఎన్నిక జరగనుంది. నోటిఫికేషన్ సెప్టెంబరు 23 వెలువడనుండగా, నామినేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఉపసంహరణకు గడువు అక్టోబరు 3 కాగా, పోలింగ్‌ను అదే నెల 21న నిర్వహించి, అక్టోబరు 24న లెక్కింపు చేపడతారు.
Samayam Telugu trs


హుజూర్ నగర్ స్థానం నుంచి గతేడాది ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నల్లగొండ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప-ఎన్నిక అనివార్యమైంది.

Read Also: ఆ రెండు కుటుంబాలదే పెత్తనం.. వారి నుంచి రాష్ట్రాన్ని రక్షించాలి: కిషన్ రెడ్డి

తెలంగాణలో ఉపఎన్నిక జరగనున్న ఏకైక స్థానం కావడంతో ప్రధాన పార్టీలన్నీ హుజూర్‌నగర్‌పై ఫోకస్ పెట్టాయి. ఓ వైపు టీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా నోటిఫికేషన్‌ వెలువడంతో రాష్ట్ర రాజకీయమంతా అక్కడే మకాం వేయనుంది. అయితే, నోటిఫికేషన్‌ వెలువడక ముందే ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ఉప ఎన్నికలో తన అభ్యర్థి కిరణ్‌రెడ్డి అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయగా, ఉత్తమ్‌, జానా, నేను ఒక్కటయ్యామని, పద్మావతిని నిలబెట్టి గెలిపిస్తామని కోమటిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌ రాజకీయం రసవత్తరంగా మారింది.

హుజూర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్:
నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ: సెప్టెంబర్ 23
నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ: సెప్టెంబర్ 30
నామినేషన్లు పరిశీలన: అక్టోబర్ 1
నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 3
పోలింగ్ తేదీ: అక్టోబర్ 21
ఎన్నికల ఫలితాలు: అక్టోబర్ 24

Read Also: కోడెల మృతి: ‘చంద్రబాబు.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ అదుర్స్’

కాంగ్రెస్‌లో కాకరేగిన గంటల వ్యవధిలోనే అధికార టీఆర్ఎస్‌కు చెందిన శంకరమ్మ రేసులో తానూ ఉన్నానంటూ తెరపైకి వచ్చారు. కేసీఆర్‌ తనకు అవకాశం ఇస్తే బీజేపీ, కాంగ్రెస్‌ల మద్దతు కోసం ప్రయత్నిస్తానని శంకరమ్మ చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్‌లో కలవరం మొదలైంది. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పేరు దాదాపు ఖరారయ్యింది. దీనిపై ఇటీవల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటన కూడా చేశారు.

Read Also: జీడిమెట్ల కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం

అయితే, పార్టీలో తనకు సమాచారం లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయని, సరైన గౌరవం దక్కడం లేదని రేవంత్‌రెడ్డి ఏకంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌నే టార్గెట్‌ చేశారు. హుజూర్‌నగర్‌లో అభ్యర్థి పేరుపై పార్టీలో ఇంతవరకు చర్చే జరగలేదని, అలాంటప్పుడు ఏకపక్షంగా పద్మావతి పేరును ఎలా ప్రకటిస్తారని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను ఆయన నిలదీశారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో పార్టీ తరుఫున అభ్యర్థిగా చామల కిరణ్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి గత బుధవారం కుంతియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేగుతోంది. రేవంత్ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.