యాప్నగరం

కేటీఆర్‌పై ఆరోపణలు.. మంత్రి కొండా సురేఖకు ఈసీ స్వీట్ వార్నింగ్..!

Lok Sabha Elections 2024: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో.. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు. కాగా.. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఆమెను సున్నితంగా హెచ్చరించింది. స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించింది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 26 Apr 2024, 10:25 pm
Election Commission: తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా రంగంలోకి దిగి ప్రచారంలో జోరు పెంచారు. ఈ క్రమంలోనే.. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో.. ఇందులో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. అందులోనూ మాజీ మంత్రి కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. దీంతో.. కేటీఆర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ ఆరోపణలు చేసినవారిలో రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఉండటం గమనార్హం. కేటీఆర్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. మంత్రి కొండా సురేఖను సున్నితంగా హెచ్చరించింది.
Samayam Telugu Konda Surekha
కొండా సురేఖ


ఎన్నికల వేళ జాగ్రత్తగా వ్యవహరించాలని కొండా సురేఖను ఈసీ హెచ్చరించింది. కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 1వ తేదీన వరంగల్‌లో మాట్లాడిన కొండా సురేఖ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. కేటీఆర్ ప్రమేయం ఉందంటూ కీలక ఆరోపణలు చేశారు. దీంతో.. సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు సురేఖ వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ.. తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేసింది.

కేటీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. ప్రత్యర్థులపై ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. స్టార్ క్యాంపెయినర్‌గా అందులోనూ మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరింత బాధ్యతగా ఉండాలని కొండా సురేఖకు ఈసీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.