యాప్నగరం

హోంమంత్రి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై క్రిమినల్ యాక్షన్: ఎన్నికల అధికారి

హొంమంత్రి మీడియాతో మాట్లాడుతూ వాణి దేవికి ఓటేశానన్నారు. అదే విధంగా పవన్ కళ్యాన్ కూడా వాణిదేవికి మద్దతు తెలిపారు. దీంతో ఇద్దరు వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Samayam Telugu 14 Mar 2021, 2:56 pm
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఓటు వివాదంలో పడింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఆదివారం ఉదయం ఆయన ఓల్డ్ మలక్ పేట లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి కి ఓటు వేసినట్లు వెల్లడించారు.
Samayam Telugu పవన్, మహమూద్ అలీ వ్యాఖ్యలపై దర్యాప్తు


మరోవైపు ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి పీవీ వాణిదేవికి మద్దతు ప్రకటిస్తున్నట్లు జనసేనఅధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాల పై దర్యాప్తు చేస్తామని, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటున్నామని ఎన్నికల చీఫ్ అబ్జార్వర్ శశాంక్ గోయల్ తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఆరోపణలపై దర్యాప్తు చేస్తామన్నారు. ఆదివారం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో పోలింగ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ పై సైబర్ క్రైం వాళ్ళు చర్యలు తీసుకుంటారన్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే క్రిమినిల్ కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు. ఫేక్ ఓటర్లు పై ఆధారాలు చూపిస్తే దర్యాప్తు చేస్తామని తెలిపారు. 4 గంటల లోపు ఉన్నవాళ్ళందరికి ఓటు అవకాశం కల్పిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.