యాప్నగరం

ఆంధ్రాను కుదిపేస్తోన్న స్కామ్.. తెలంగాణలో ఏపీ ఏసీబీ అధికారుల రహస్య విచారణ!

ఆంధ్రాలో సంచలనంగా మారిన ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏపీకి చెందిన ఏసీబీ అధికారులు రహస్యంగా తెలంగాణలోని కోదాడ ప్రాంతంలో విచారణ చేపట్టడం స్థానికంగా కలకలం సృష్టించింది.

Samayam Telugu 22 Jun 2020, 9:43 am
ఏపీలో ఈఎస్ఐ స్కామ్‌కు సంబంధించిన కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏసీబీ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. టెలీ హెల్త్ సర్వీసులకు సంబంధించి నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్ట్ ఇచ్చారని కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రా ఏసీబీ అధికారులు రహస్యంగా కోదాడలో విచారణ జరిపడం స్థానికంగా సంచలనమైంది. ఈఎస్ఐ స్కామ్‌లో ఏ-1 నిందితుడు ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ రమేష్‌కుమార్‌, ఏ-2గా ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ ఇప్పటికే అరెస్ట్ చేసింది.
Samayam Telugu ఏసీబీ ఆఫీస్
acb


కోదాడకు చెందిన ప్రమోద్ రెడ్డిని ఏ-3గా ఈ కేసులో చేర్చారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న టెలీహెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి డైరెక్టర్‌గా ప్రమోద్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టయిన దగ్గర్నుంచి ప్రమోద్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు.

దీంతో అతడి ఆచూకీ కోసం ఆంధ్రా ఏసీబీ అధికారులు కోదాడ వచ్చారు. అతడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను రహస్యంగా విచారించారు. ప్రమోద్ రెడ్డి సొంతూరైన అనంతగిరి మండలంలోనూ విచారణ జరిపారు. అతడి జాడ కోసం కోదాడ, పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.