యాప్నగరం

సొంత నియోజకవర్గంలో ఈటల పర్యటన రద్దు

రాజీనామా తర్వాత మంగళవారం తొలిసారిగా ఈటల తన నియోజకవర్గంలో పర్యటించారు. ఇవాళ కూడా ఆయన పలు గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన రద్దయ్యింది.

Samayam Telugu 9 Jun 2021, 11:13 am
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రెండో రోజు హుజూరాబాద్‌లో పర్యటించాల్సి ఉండగా ఆయన టూర్ రద్దు అయ్యింది. ఇల్లందకుంట మండలం లక్మాజిపల్లి, మల్యాల, వాగొడ్డు రామన్నపల్లి, ఇల్లందకుంట గ్రామాల్లో ఇవాళ ఈటల పర్యటన కొనసాగాల్సి ఉండగా.. అది కాస్త రద్దు చేసుకున్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు.
Samayam Telugu ఈటల పర్యటన రద్దు


కమలాపూర్ మండలంలో రోడ్ షోలు, ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఇల్లందకుంట మండలంలో ఈటల రాజేందర్ పర్యటించాల్సి ఉండగా వర్షం కారణంగా రోడ్ షో రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే మంగళవారం కమలాపూర్‌లో రోడ్ షో అనంతరం.. ఈటల రాజేందర్.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్‌కు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. హుజురాబాద్ విజయమే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని స్పష్టం చేశారు. ప్రజలు తన వెంటే ఉంటారని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు ఈటల. ఇక టీఆర్ఎస్ పార్టీతో మరో యుద్ధానికి హుజురాబాదే నాంది పలుకనుందని ఈటల వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.