యాప్నగరం

Swaero: అసలైన దేశభక్తులెవరు.? గతం గుర్తు చేసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్, షాకింగ్ ట్వీట్

సైనిక్ స్కూల్ విద్యార్థి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి ఎంపికవడంపై ఆర్‌ఎస్ ప్రవీణ్ సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థికి అభినందనలు తెలిపారు. ఆ స్కూల్ ప్రారంభోత్సవం సమయంలో జరిగిన విషయాలను ఆయన గుర్తు చేశారు.

Samayam Telugu 30 Oct 2021, 6:10 pm
రాజకీయ, సామాజిక అంశాలపై తనదైన స్టైల్లో స్పందించే మాజీ ఐపీఎస్, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మరోమారు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ గురుకులాల విద్యార్థి వాయుసేనకి ఎంపికైన సందర్భంగా ఆయన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ షాకింగ్ ట్వీట్ చేశారు. సైనిక్ స్కూల్ ప్రారంభించినందుకు తనపై ఆర్ఎస్ఎస్ ముసుగు సంస్థ ఏకంగా గవర్నర్‌కి ఫిర్యాదు చేసిందని ఆయన అన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rs praveen


మొదటిసారి రుక్మాపూర్ సోషల్ వెల్ఫేర్ సైనిక్ స్కూల్ నుంచి సాయి అనే విద్యార్థి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా ఎంపికయ్యాడని ఆర్ఎస్ ప్రవీణ్ తెలిపారు. క్యాడెట్ సాయికి ఆయన శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సైనిక్ స్కూల్ ప్రారంభించన సమయంలో జరిగిన ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ స్కూల్ ప్రారంభించినందుకు ఓ ఆర్‌ఎస్‌ఎస్ ముసుగు సంస్థ తనపై దేశద్రోహం కేసు పెట్టాలని గవర్నర్ నరసింహన్‌‌కి ఫిర్యాదు చేసిందని ఆయన తెలిపారు. అసలైన దేశభక్తులెవరో ఇప్పుడు చెప్పాలని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. అసలైన దేశభక్తులెవరని ఆయన ప్రశ్నించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.