యాప్నగరం

కేసీఆర్ వాళ్ల కోసం రక్తం బొట్టు రాల్చరు.. జనం తక్కువ కదా.! మాజీ ఐపీఎస్ సెటైర్లు

దళిత బంధు అమలు కోసం తన చివరి రక్తపు బొట్టు వరకూ పనిచేస్తానంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన వారి జనాభా తక్కువ కదా అందుకేనంటూ మాజీ ఐపీఎస్ షాకింగ్ ట్వీట్ చేశారు.

Samayam Telugu 29 Aug 2021, 7:23 pm
గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టి హుజూరాబాద్‌లో గులాబీ జెండా రెపరెపలాడించేందుకు కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకొచ్చారంటూ విపక్షాలు ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇటీవల కరీంనగర్ పర్యటనలో దళిత బంధుపై సమీక్ష సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ కోసం ఎంత మొండిగా కొట్లాడానో.. ప్రతి ఒక్క దళితుడికి పథకం చేరే వరకూ.. తన చివరి రక్తం బొట్టు ఉన్నవరకూ పనిచేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kcr


బహుజన వాదంతో ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన నిన్న ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లారు. అక్కడి కుమ్మరి, మేతరి కుటుంబాలను కలిసి చేతివృత్తుల వారి కష్టాలను అడిగి తెలుసుకున్న ఆయన కేసీఆర్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. నడుము విరిగేలా శ్రమించినా కుమ్మరులు, మేతరి వంటి వర్గాల ఆదాయం అంతంతమాత్రమేనని.. వారిని ఆదుకునేందుకు మాత్రం కేసీఆర్‌కి మనసు రావడం లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

సీఎం కేసీఆర్ వారి కోసం రక్లపు బొట్టు రాల్చరంటూ ఘాటు సెటైర్లు వేశారు. సదరు వెనకబడిన వర్గాల వారి జనాభా తక్కువగా ఉండడమే అందుకు కారణమని ఆయన తేల్చేశారు. అత్యంత వెనకబడిన వర్గాల వారి కోసం ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్‌కి చిల్లి గవ్వ కూడా ఇవ్వరని ఆర్‌ఎస్ ప్రవీణ్ తెలిపారు. వారందరికీ బహుజన రాజ్యమే సమాధానమని.. అందరికీ ఏనుగే శరణ్యమని ఆయన అన్నారు.



Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.