యాప్నగరం

‘విద్యార్థినుల బట్టల్లోకి జెర్రులు.. బాత్రూముల్లో తేళ్లు..’ ఆర్‌ఎస్ ప్రవీణ్ ఆగ్రహం

గురుకుల విద్యాలయాల దుస్థితిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ సర్కార్ పాలన విద్యావ్యవస్థకు చీకటిపర్వమని.. భావితరాల భవిష్యత్తును ఛిద్రం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Samayam Telugu 16 Nov 2021, 2:09 pm
బహుజన నినాదంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మరోమారు కేసీఆర్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యావ్యవస్థపై టీఆర్‌ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. బట్టల్లోకి జెర్రులు, బాత్రూముల్లో తేళ్లు వస్తున్నాయని.. బయటకు రావాలంటేనే భయమేస్తోందంటూ మహాత్మ జ్యోతిరావుపూలే పాఠశాల విద్యార్థినులు ఆందోళన చేయడంపై ఆర్ఎస్ ప్రవీణ్ స్పందించారు. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rs praveen


బంగారు తెలంగాణలో టీఆర్‌ఎస్ పాలన విద్యావ్యవస్థకు ముమ్మాటికీ చీకటిపర్వమని ప్రవీణ్ మండిపడ్డారు. యూనివర్సిటీల్లో బోధకులు లేరని, పాఠశాలలో విద్యావాలంటీర్ల కొరత, గురుకులాలకు సొంత భవనాలు లేవని ఆయన అన్నారు. ఈ పాలకులు తెలంగాణ భావితరాల భవిష్యత్తును ఛిద్రం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన రాజ్యంతోనే విద్యావ్యస్థలో వెలుగొస్తుందని ఆయన అన్నారు.

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లిలోని మహాత్మజ్యోతిరావుపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో కలసి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. పాఠశాలలో వసతులు అధ్వానంగా ఉన్నాయని.. జెర్రులు, తేళ్లు తిరుగుతున్నాయని.. బయటికి రావాలంటేనే భయమేస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. తల్లిదండ్రులతో కలసి రాజీవ్ రహదారిపై ధర్నా చేశారు.



Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.