యాప్నగరం

ఈటల ఘన విజయం.. జేజేలు పలికిన ఆర్‌ఎస్ ప్రవీణ్, షాకింగ్ ట్వీట్

హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించడంపై ఆర్‌ఎస్ ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హుజూరాబాద్ ప్రజలకు జేజేలు పలికారు.

Samayam Telugu 2 Nov 2021, 11:04 pm
తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఒకవైపు ప్రభుత్వ పథకాలు, నిధుల వరద పారిస్తున్నా ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళ్లిన ఈటల అనూహ్య విజయం సొంతం చేసుకున్నారు. అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థిపై 24 వేల ఓట్ల భారీ మెజార్టీ సాధించారు. హోరాహోరీ సాగిన హుజూరాబాద్ పోరులో ఈటల విజయంపై మాజీ ఐపీఎస్, బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rs praveen


చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్ పాలకులు అహంకారం, కక్షతో అధికార దుర్వినియోగానికి పాల్పడడ్డారని ప్రవీణ్ ధ్వజమెత్తారు. అయినా పాలకులకు కర్రు కాల్చి వాత పెట్టి మరీ బహుజన బిడ్డ ఈటల రాజేందర్‌ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న హుజూరాబాద్ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. బెదిరించినా తెలంగాణ ఇక మీకు లొంగదు గాక లొంగదంటూ షాకింగ్ ట్వీట్ చేశారు.

ఐదు నెలలుగా సాగిన ఉత్కంఠ పోరులో ఈటల రాజేందర్ విజయం సాధించడంపై ఆర్‌ఎస్ ప్రవీణ్ సంతోషం వ్యక్తం చేశారు. బీసీ అయిన ఈటల రాజేందర్‌ను గెలిపించిన ప్రజలకు ఆయన జేజేలు పలికారు. ఇకపై తెలంగాణలో ప్రలోభాలు, బెదిరింపులు పనిచేయవని ఆయన అన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.