యాప్నగరం

ఈటల ఫ్యూడల్.. నమ్మొద్దు! కేసీఆర్ మొనగాడు.. మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్

తెలంగాణ రాజకీయాలు దళిత బంధు పథకం చుట్టూ తిరుగుతున్నాయి. మాజీ మంత్రి దళిత నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ఈటలను టార్గెట్ చేస్తూ.. మరోవైపు కేసీఆర్‌ను ఆకాశానికెత్తారు.

Samayam Telugu 29 Jul 2021, 3:01 pm
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈటల బామ్మర్ది మధుసూదన్ రెడ్డి వాట్సాప్ చాటింగ్‌ లీకేజీపై టుగా స్పందించారు. దళితులను బూతులు తిట్టడంపై ఆయన మండిపడ్డారు. ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న ఈటలని నమ్మొద్దని.. నియోజకవర్గ ప్రజలంతా ఆయన్ను బహిష్కరించాలన్నారు. దళితుల నుంచి అసైన్డ్ భూములు లాక్కున్న ఈటలకి పుట్టగతులుండవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kcr


అలాగే సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకంపై ప్రశంసలు కురిపించారు. దళిత బంధుని ప్రతిఒక్కరూ స్వాగతించాలని మోత్కుపల్లి అన్నారు. ఒక్కో దళితునికి పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన దేశంలోనే ఏకైక మొనగాడు కేసీఆర్ ఒక్కడేనని మోత్కుపల్లి ఆకాశానికెత్తారు. దళిత బంధుని అడ్డుకోవడం సరికాదని.. అందరూ కేసీఆర్‌ని బలపరచాలన్నారు. దళిత బంధు గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే గ్రామాల్లో తగిన గుణపాఠం చెప్పాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

రైతు బంధు మాదిరిగానే దళిత బంధు కూడా మంచి పథకమని మోత్కుపల్లి అన్నారు. ఇలాంటి పథకాలను జాతీయ పార్టీలు తీసుకురాలేవని.. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం ఒక్క కేసీఆర్‌కి మాత్రమే ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు దళిత బంధుని స్వాగతించాలని ఆయన కోరారు. ఇలాంటి పథకాలతో అట్టడుగు వర్గాల వారికి ఉపమోగపడుతుందని ఆయన అన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.