యాప్నగరం

మాజీ మంత్రికి రోడ్డు ప్రమాదం.. రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు

Khammam: రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాలుగు సార్లు తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

Samayam Telugu 1 Jul 2020, 12:50 am
సూర్యాపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి త్రుటిలో రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన కారులో వెళ్తుండగా ఖమ్మం జిల్లా సుజాత నగర్‌లో దామోదర్ రెడ్డి వాహనాన్ని మరో కారు బలంగా ఢీకొంది. దీంతో దామోదర్ రెడ్డి వాహనం రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో దామోదర్ రెడ్డి క్షేమంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మాజీ మంత్రిని ఆస్పత్రికి తరలించారు. ఎదురుగా వచ్చిన కారు అతి వేగంగా రావడంతోనే అదుపుతప్పి దామోదర్ రెడ్డి కారును ఢీకొన్నట్లుగా తెలుస్తోంది.
Samayam Telugu మాజీ మంత్రికి రోడ్డు ప్రమాదం.. రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు
ramreddy damodar


Also Read: హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ లేనట్లేనా? భిన్నవాదనలు

రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాలుగు సార్లు తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పని చేశారు.

Also Read: undefined

Also Read: ‘హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ ఉందా‌?’ మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.