యాప్నగరం

కొవిడ్ వల్లే నా తండ్రి మరణం.. కానీ కరోనా వైరస్ ఆయన్ని చంపలేదు

Bhadrachalam: తన తండ్రి రాజయ్య ఉద్యమాలే ఊపిరిగా బతికారని, అందుకే తనకు సీతారామరాజు అని పేరు పెట్టుకున్నారని సీతారామరాజు వివరించారు. తండ్రి ఎల్లప్పుడూ ప్రజల కోసం పాటుపడితే ఆ ప్రజలే ఆయన్ను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

Samayam Telugu 7 Aug 2020, 9:13 pm
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య కరోనా బారిన పడి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పట్ల పార్టీలకతీతంగా నేతలు సంతాపం ప్రకటించారు. అయితే, ఆయన కుమారుడు సీతారామరాజు తన తండ్రి మరణం పట్ల స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ఆడియోను రికార్డు చేసి విడుదల చేశారు. ఈ ఆడియో ఫైల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Samayam Telugu సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్యే (ఫైల్ ఫోటో)
Ex MLA sunnam rajaiah


కరోనా సోకిన తన తండ్రి పట్ల గ్రామంలో ప్రజలు తీవ్రమైన వివక్ష చూపారని సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత తన సోదరికి కరోనా సోకిందని, ఆ ప్రభావంతో తన తండ్రిని గ్రామస్థులు వెలివేసినట్లు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన్ను అదోలా చూడటం, వీధిలో నడుస్తున్నప్పుడు తలుపులు మూసుకోవడం వంటివి చేశారని వివరించారు. ఈ క్రమంలో ఆయన మానసికంగా కుంగిపోయారని వెల్లడించారు. ఆ తర్వాత ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని చెప్పారు. దీంతో, ఆయనలో విపరీతమైన వివక్ష ధోరణి ఏర్పడిందని వివరించారు.

Must Read: TS: పడిపోయిన బీర్ల అమ్మకాలు.. లిక్కర్ మాత్రం జోరుగా.. కారణాలివే..

తన తండ్రి ఉద్యమాలే ఊపిరిగా బతికారని, అందుకే తనకు సీతారామరాజు అని పేరు పెట్టుకున్నారని వివరించారు. తండ్రి ఎల్లప్పుడూ ప్రజల కోసం పాటుపడితే ఆ ప్రజలే ఆయన్ను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి తట్టుకోలేకపోయారని వివరించారు. ప్రజలు పలకరిస్తూ, ధైర్యం చెప్పి ఉంటే ఆయన బతికి ఉండేవారని అన్నారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.