యాప్నగరం

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఇంట విషాదం

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అల్లుడుకు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

Samayam Telugu 2 Aug 2021, 11:19 am
మాజీ ఎమ్మెల్యే ఇంట విషాదం నెలకొంది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అల్లుడు బి.శ్రీనివా‌స్‌రెడ్డి (55) గుండెపోటుతో మృతి చెందారు. కోకాపేటలో ఉంటున్న ఆయనకు శనివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి మృతిచెందారు. మంత్రి సబితారెడ్డి ఆదివారం శ్రీనివా‌స్‌రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి తీగల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమెరికాలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి కుమార్తె వచ్చిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.