యాప్నగరం

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.

Samayam Telugu 21 Oct 2019, 9:39 pm
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీదే విజయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి 50 శాతానికి పైగా ఓట్లు దక్కుతాయని వెల్లడించాయి. 53 శాతం ఓట్లతో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడి చేయగా.. 50 శాతానికి పైగా ఓట్లతో గులాబీ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ఆరా ఎగ్జిట్ పోల్స్‌ తెలిపింది.
Samayam Telugu evm


హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో 86.38 శాతం పోలింగ్ నమోదైంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ అసెంబ్లీ స్థానానికి సోమవారం (అక్టోబర్ 21) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.

Also Read: అక్క మీద కోపంతో కుక్కను చంపేశాడు.. హైదరాబాద్‌లో దారుణం

హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లో పోలింగ్‌ జరిగింది. హుజూర్‌నగర్‌, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉప ఎన్నికలో 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే కొనసాగింది. టీఆర్‌ఎస్ తరపున సైదిరెడ్డి కాంగ్రెన్‌ నుంచి పద్మావతి ఉత్తమ్ రెడ్డి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, బీజేపీ నుంచి కోట రామారావు బరిలో నిలిచారు. అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.