యాప్నగరం

టీఆర్ఎస్‌లోకి దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి.. పోలీసులకు ఫిర్యాదు

ఓ ప్రముఖ టీవీ ఛానల్ లోగోతో వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై స్పందించిన దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 3 Nov 2020, 10:37 am
దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తొగుట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీంతో ఈ ప్రచారంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఓటమి ఖాయం అని తెలిసే బీజేపీ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఓ న్యూస్ ఛానల్‌ లోగోతో చెరుకు శ్రీనివాసరెడ్డిపై ఫేక్ వీడియో తయారు చేయించారు. దీనిపై సదరు టీవీ ఛానల్ సైతం అది తమ వీడియో కాదని,ఫేక్ వీడియో అని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస రెడ్డి
congress candidate cheruku srinivas reddy


మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సైతం... సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఆయన ఆరోపించారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయాలకు తెర తీశారని ధ్వజమెత్తారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలకు తెగబడ్డాయని మండిపడ్డారు. ఫేక్ న్యూస్‌లను వ్యాప్తి చేస్తూ ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే కుట్రకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సిద్ధపడ్డాయన్నారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి వెనుక హరీష్ రావు, రఘునందన్ ఉన్నారని రేవంత్ ఆరోపించారు.

Read More: గుండెలపై కేసీఆర్.. ఇలాంటివి వద్దన్న కేటీఆర్

మరోవైపు ట్విట్టర్‌లో సైతం రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు.‘ దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయానికి తెర తీశాయి.కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలకు తెగబడ్డాయి.తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.ప్రజలు అనవసర గందరగోళాలకు గురి కావద్దు.. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ప్రజలు అనవసర గందరగోళాలకు గురి కావద్దని, దుష్ర్ఫచారాలపై అప్రమత్తంగా ఉండాని రేవంత్ సూచించారు. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటేయాలని కోరారు’. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకుకూడా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.