యాప్నగరం

ఆయిల్ ట్యాంకర్లే టార్గెట్.. నకిలీ విజిలెన్స్ అధికారుల ముఠా గుట్టురట్టు

విజిలెన్స్ అధికారుల పేరుతో ఆయిల్ ట్యాంకర్ల యజమానులను బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. మొతం ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు.

Samayam Telugu 22 Aug 2019, 10:19 am
యిల్ ట్యాంకర్ల యజమానులను టార్గెట్ చేసుకొని విజిలెన్స్ అధికారులమంటూ దోపీడీకి పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ఫజిల్ రెహ్మన్ అనే వ్యక్తి ఆరుగురు సభ్యులతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు.
Samayam Telugu Fake Vilgilence


ముఠా సాయంతో ఆయిల్ ట్యాంకర్ల యజమానులను టార్గెట్ చేసుకొని విజిలెన్స్ అధికారుల పేరుతో దాడులు చేస్తున్నాడు. కల్తీ ఆయిల్ సరఫరా చేస్తున్నారంటూ యజమానులను బెదిరించి రూ. లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆయిల్ ట్యాంకర్‌ను ఆపి, రూ. 6 లక్షలు దోపిడీ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఘట్కేసర్ పోలీసులు భువనగిరి ఎస్‌వోటీ పోలీసుల సహాయంతో నిఘా వేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

Read Also: విద్యార్థినితో లెక్చరర్ ప్రేమ పెళ్లి.. తర్వాత అసలు విషయం తెలిసి..

వారి వద్ద నుంచి రూ. 8.80 లక్షల నగదుతోపాటు, టాటా ఇండికా కారు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల విచారణలో ఈ ముఠాకు మరో మూడు నేరాలతో సంబంధం ఉన్నట్లు తెలిసింది. ముఠాను పట్టుకున్న ఘట్కేసర్, భువనగిరి ఎస్‌వోటీ పోలీసులను రాజకొండ అడిషనల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అభినందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.