యాప్నగరం

కోర్టు తీర్పుపై సమత భర్త కీలక వ్యాఖ్యలు

Samatha Murder Case: గురువారం మధ్యాహ్నం తీర్పు వెలువడిన వెంటనే సమత భర్త ఆనందంతో కోర్టు బయటకు వచ్చారు. కేసులో తొలి నుంచి దర్యాప్తు పక్కాగా చేపట్టిన చేపట్టిన పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Samayam Telugu 30 Jan 2020, 6:38 pm
సమత అత్యాచారం, హత్య కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు వెలువరించిన తుది తీర్పుపై బాధితురాలి భర్త స్పందించారు. వెంటనే మరణ శిక్షను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పైకోర్టుకు అప్పీలుకు వెళ్లేందుకు నిందితులకు అవకాశం ఇవ్వొద్దని కోరారు. తీర్పుపై సమత భర్త, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ, తన పిల్లలకు తల్లి లేని లోటు తీర్చలేమని కన్నీళ్లు పెట్టుకున్నారు. గురువారం మధ్యాహ్నం తీర్పు వెలువడిన వెంటనే సమత భర్త ఆనందంతో కోర్టు బయటకు వచ్చారు. కేసులో తొలి నుంచి దర్యాప్తు పక్కాగా చేపట్టిన చేపట్టిన పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Samayam Telugu Adilabad Sessions Court


Also Read: రేప్ చేస్తున్నప్పుడు మీరు చూశారా? సమత దోషుల తరపున సంచలన వ్యాఖ్యలు


అయితే, సమత కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేశామని, అన్ని సాక్ష్యాలను పక్కాగా సంపాదించి, కోర్టు ముందు ఉంచినట్లు ఆసిఫాబాద్‌ ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. ఇలాంటి తీర్పులతో చట్టాలపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Also Read: ఇక ఆ ఆర్టీసీ బస్సులన్నింటిపై కేసీఆర్ బొమ్మలు: మంత్రి

కోర్టులో దోషుల కంటతడి..
గురువారం కోర్టులో న్యాయమూర్తి మాట్లాడుతూ.. మీపై నేరం రుజువైందని, కోర్టుకు ఏమైనా చెప్పుకొనేది ఉందా అని నిందితులకు అడిగారు. దీనిపై స్పందించిన ప్రధాన నిందితుడు షేక్ బాబు.. తనకు ప్రాణభిక్ష పెట్టాలని, కంటతడి పెడుతూ న్యాయమూర్తిని వేడుకున్నాడు. మిగతా నిందితులు కూడా ఇదే కోరారు. తమకు చిన్న పిల్లలున్నారని, తమ తల్లిదండ్రులను కూడా తామే చూసుకోవాలని చెప్పారు. కుటుంబానికి పెద్ద దిక్కు తామేనని వాపోయారు. కాబట్టి తమను వదిలేయాలని నిందితులు న్యాయమూర్తిని వేడుకున్నారు.


Also Read: సమత హత్యాచార కేసులో సంచలన తీర్పు వెల్లడి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.