యాప్నగరం

రైతు వేదిక కోసం భూమి ఇవ్వాలని ఒత్తిడి.. రైతు ఆత్మహత్య!

రైతు వేదిక నిర్మాణం కోసం భూమి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేయడంతో ఓ యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.

Samayam Telugu 30 Jul 2020, 1:22 pm
రైతు వేదిక నిర్మాణం కోసం భూమి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేయడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వర్గల్ మండలం వేలూరుకు చెందిన బ్యాగరి నర్సింహులు అనే రైతుకు 13 గుంటల భూమి ఉంది. ఈ భూమిని రైతు వేదిక నిర్మాణానికి ఇవ్వాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ కారణంతోనే భూమిని రికార్డుల్లోకి కూడా ఎక్కించలేదని సమాచారం.
Samayam Telugu నమూనా చిత్రం


దీంతో మనస్థాపం చెందిన నర్సింహులు బుధవారం పొలం దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే అతణ్ని గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సిద్ధిపేట తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు.

రెవెన్యూ అధికారుల ఒత్తిడితోనే నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన అతడి మరణానికి కారణమైన వారిపై అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు బ్యాగరి నర్సింహులుది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యేనని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకోవడం పార్టీ నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.