యాప్నగరం

నల్గొండ జిల్లా రైతు పంట పండింది.. పొలంలో వజ్రం దొరికింది

రైతు సాగు నీటి కోసం బావి తవ్వాడు. అయితే ఈ తవ్వకాల్లో విలువైన రాయి ఒకటి బయటి పడింది. దీంతో వెంటనే దాన్ని రైతు తీసుకెళ్లి హైదరాబాద్‌లో పరీక్షలు జరిపాడు.

Samayam Telugu 10 Oct 2020, 6:41 pm
తెలంగాణ ప్రధానంగా నిజాం నవాబులు పాలించిన ప్రాంతం. 1724 నుంచి 1948 వరకు హైదరాబాదును పరిపాలించారు. అందుకే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో అప్పటి రాజులు దాచి ఉంచారేమోనన్న అనుమానంతో నిధుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో కోటల్లో, పాత భవనాల్లో నిధుల కోసం గాలింపు చేస్తున్నారు. అయితే తాజాగా నల్గొండ జిల్లాలో వజ్రాలు దొరికాయన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత నల్గొండ ప్రస్తుత రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండల ఆవులపల్లిలో ఓ రైతు పొలంలో ఓ వజ్రపు రాయి బయట పడింది.
Samayam Telugu రైతుకు పొలంలో దొరికిన వజ్రం
diamond found in farm


Read More: హైదరాబాద్ గోకార్టింగ్ సీజ్.. నిర్వాహకులు అరెస్ట్

రైతు సాగు నీటి కోసం తవ్విన బావిలోఈ వజ్రం బయటపడింది. అయితే ఆ రాయి సరికొత్తగా కనిపించడంతో రైతు వెంటనే అది విలువైన రాయి ఉంటుందన్న అనుమానంతో హైదరాబాద్ ల్యాబ్ లో నిర్వహించిన పరీక్షల్లో వజ్రంగా గుర్తించారు. గతంలో జిల్లాలోని కృష్ణా, మూసీ పరివాహక ప్రాంతాలలో కూడా వజ్రాలు దొరికిన సందర్భాలున్నాయి. దీంతో రామడుగు, చండూరు, గుర్రంపోడు, ఉట్లపల్లి, పెదవాగు, డిండి, హాలియా వాగు ప్రాంతాల్లో భూగర్భంలో వజ్రాల గనులు ఉన్నట్లు గుర్తించి జీఎస్ఐ, ఓయూ భౌతిక శాస్త్రం విభాగం సర్వే చేసింది. నల్గొండ జిల్లాలో13 జోన్లలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఏపీలో కర్నూలు జిల్లాలో తొలకరిలో వజ్రాలు దొరికాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.