యాప్నగరం

సన్నరకం పంటకు నిప్పు.. కంటతడి పెట్టుకున్న రైతన్న

మూడు ఎకరాల్లో సన్నరకం.. రెండు ఎకరాల్లో దొడ్డురకం సాగు చేశాడు. అయితే దొడ్డురకం పంట బాగానే ఉన్నా... సన్నరకం వేసిన పంట మాత్రం పూర్తిగా నష్టపోయామంటూ పంటకు నిప్పు పెట్టాడు.

Samayam Telugu 8 Nov 2020, 2:26 pm
తెలంగాణ రైతు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. తాను వేసిన పంటకు నిప్పు పెట్టి అతను కూడా ఆ మంటల్లో పడి చచ్చిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో స్థానికులు అతడ్ని అడ్డుకున్నారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామాంలో చోటు చేసుకుంది. నక్కల బాపిరెడ్డి అనే రైతుకు తనకున్న ఐదెకరాల పొలంలో మూడు ఎకరాల్లోసన్నరకం పంటను వేశాడు. మరో రెండు ఎకరాల్లో దొడ్డరకం వరి సాగు చేశాడు.
Samayam Telugu వరి పంటకు నిప్పు


సిఎం కెసిఆర్ పిలుపు మేరకు సన్నరకం పంట వేసి పూర్తిగా నష్టపోయామంటు నిరసన వ్యక్తం చేస్తూ తన మూడెకరాల పంటకు రైతు నిప్పంటించాడు. తను కూడా అదే మంటల్లో పడేందుకు ప్రయత్నించిగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దొడ్డురకం పంట సాగు బాగానే ఉంది కానీ సన్నరకం వరి పంట పూర్తిగా దెబ్బతిందని రైతు ఆవేదన వ్యక్తంచేశాడు. మూడెకరాల పంటను మొత్తం అమ్మిన కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేద్నాడు. దీంతో ఆందోళన చెందిన రైతు తన మూడెకరాల పంటకు నిప్పంటించి తను కూడా అదే మంటల్లో పడేందుకు ప్రయత్నించాడని తెలిపాడు.

Read More: సచివాలయంలో ఏది ఎలా ఉండాలన్నది ఆయన ఆలోచనే.. మంత్రి వేముల ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్నో సంవత్సరాల నుండి దొడ్డురకం పంట వేస్తున్నామని ఎప్పుడు నష్ట పోలేదని తెలిపాడు బాపిరెడ్డి. ఏ సమయంలో ఎ పంట వేయ్యలో రైతులకు తెలుసని కానీ ఈసారి ప్రభుత్వం సన్నరకం వరి పంట వేయ్యలని ఒత్తిడి తేవడంతో సన్న రకం పంట వేసి పూర్తిగా నష్టపోయామన్నారు. మూడెకరాల పంటలో కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటి వరకు పంటకు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎక్కడి నుండి తెచ్చి కట్టాలని మా పరిస్థితి ఎంటని ప్రశ్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.