యాప్నగరం

అవినీతి MRO అరాచకం.. రైతు వద్ద లంచం! అతణ్నే కారుతో గుద్దినంత పని చేసి.. షాకింగ్ వీడియో

Lingala MRO: ఎమ్మార్వో తీరుపై తిరగబడ్డ రైతులంతా శుక్రవారం ఆయన కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఈ విషయం పెద్దది కావడంతో వివాదం నుంచి ఎమ్మార్వో తప్పించుకునే ప్రయత్నం చేశారు.

Samayam Telugu 4 Sep 2020, 10:37 pm
రెవెన్యూ శాఖలో అవినీతి వేళ్లూనుకుపోయిందనేందుకు తాజాగా వెలుగు చూస్తున్న ఘటనలే అద్దం పడుతున్నాయి. కీసర తహసీల్దార్‌ కోటి రూపాయల లంచం వ్యవహారం విచారణ దశలో ఉండగానే మరో అవినీతి బాగోతం బయటపడింది. ఓ రైతు నుంచి రూ.1.5 లక్షలు లంచం డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా లింగాల తహసీల్దార్ మల్లిఖార్జున్ వివాదంలో ఇరుక్కున్నారు. తాను కోరిన లంచం డబ్బు ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేయగా, రైతు తర్వాత ఇస్తానని చెప్పి తొలుత అడ్వాన్స్‌గా రూ.50 వేలు ఇచ్చాడు. అదే పని కోసం మళ్లీ మరో రైతు నుంచి అదనపు డబ్బులకు ఎమ్మార్వో కక్కుర్తిపడడం గమనార్హం.
Samayam Telugu డబ్బు తిరిగి ఇస్తున్న దృశ్యం
Farmers protests against lingala mro over his corruption


ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఇతరులకు పట్టా పంపిణీ చేశాడు. ఎమ్మార్వో తీరుపై తిరగబడ్డ రైతులంతా శుక్రవారం ఆయన కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీంతో ఈ విషయం పెద్దది కావడంతో వివాదం నుంచి ఎమ్మార్వో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తొలుత రూ.50 వేలు తీసుకున్న రైతుకు రూ.40 వేలు తిరిగి ఇచ్చేశాడు. మిగతా పదివేలు కూడా ఇవ్వాలని పట్టుబట్టగా ఖర్చయ్యాయని చెప్పి, అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించాడు.

Must Read: గ్రూప్-2 అధికారిణి కాన్పుకు 29 లక్షల బిల్లు.. కరోనా చికిత్స చేసి మృతదేహం ఇచ్చారు. Hydలోని ఆస్పత్రి నిలువు దోపిడీ

దీంతో ఎమ్మార్వో కారుకు బాధిత రైతు అడ్డుపడ్డాడు. అయినప్పటికీ రైతును కారుతో తోసేసుకుంటూ ఎమ్మార్వో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కింద పడిపోయిన రైతుకు స్వల్ప గాయాలయ్యాయి. అయినా కారు ఆపకుండా ఎమ్మార్వో వెళ్లిపోవడం గమనించదగ్గ విషయం.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.