యాప్నగరం

TS: పెళ్లి కాకున్నా అయినట్లు సర్టిఫికేట్, రెసిడెన్స్ కూడా.. ఇంకో షాకింగ్ ట్విస్ట్!

Rangareddy: రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో జరిగింది. లాల్ సింగ్ తండాలో అంగన్ వాడి పోస్ట్ కోసం అదే తండాకు చెందిన నరేష్ (17) మరో గ్రామానికి చెందిన కవిత అనే అమ్మాయితో వివాహం అయినట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు.

Samayam Telugu 3 Nov 2020, 6:52 pm
రంగారెడ్డి జిల్లాలో ఓ తహసీల్దార్ నిర్వాకం బయటపడింది. ఓ జంటకు పెళ్లి కాకపోయినా అయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అంతేకాక, వారికి రెసిడెన్స్ సర్టిఫికేట్ (నివాస ధ్రువీకరణ పత్రం) కూడా ఇచ్చారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ జంటలో అబ్బాయి మైనర్ కాగా.. అమ్మాయి మేజర్ కావడం గమనార్హం. అయినా తహసీల్దారు సంతకంతో ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు ఇచ్చారు. వారిద్దరు ఒక్క దగ్గర ఉండకపోయినా ఉన్నట్లు ధ్రువీకరణ చేశారు. అన్ని పరిశీలించాలసిన అధికారులు అవేమీ పట్టించుకోకుండా సంతకాలు చేశారు. ఈ ఘటన అత్యంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu రెవెన్యూ సిబ్బంది జారీ చేసిన పత్రాలు
farooq nagar revenue officers


ఇది రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో జరిగింది. లాల్ సింగ్ తండాలో అంగన్ వాడి పోస్ట్ కోసం అదే తండాకు చెందిన నరేష్ (17) మరో గ్రామానికి చెందిన కవిత అనే అమ్మాయితో వివాహం అయినట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నట్టు ధ్రువీకరణ పత్రం కూడా ఫరూక్ నగర్ మండల తహసిల్దార్ పాండు సెప్టెంబరు 16న ఇచ్చారు. దీంతో గ్రామస్థులు వారిద్దరికి వివాహం కాలేదని అదే నెల 30న షాద్ నగర్ ఆర్డీఓకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. దీంతో అక్టోబరు 1న తహసీల్దార్ మళ్ళీ దాన్ని క్యాన్సలేషన్ చేసి ఇచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.