యాప్నగరం

సిద్దిపేట: ఎమ్మార్వో ఆఫీస్‌లో తండ్రీకూతుళ్లు పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్

Siddipet: తమకు న్యాయం చేసేంతవరకు తహసీల్దార్ కార్యాలయంలోనే ఉంటామని లేకుంటే కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ సీసాతో ఆందోళన చేశారు.

Samayam Telugu 26 Aug 2020, 7:42 pm
సిద్దిపేట జిల్లాలోని ఓ తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ డబ్బాతో తండ్రీ కూతుళ్లు హల్ చల్ సృష్టించారు. లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని అత్మహత్య చేసుకుంటామని అధికారులను బెదిరించారు. ఎన్నో ఏళ్ల నుంచి కోహెడ ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఈ ఘటన జరిగింది. చెంచలచెరువులపల్లి గ్రామానికి చెందిన భీంరెడ్డి తిరుపతి రెడ్డి, అతని కుమార్తె స్వరూప తమ భూమి వేరే వాళ్ల పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
father and daughter makes hal chal with petrol bottle in siddipet


తన తండ్రి తిరుపతి రెడ్డికి చెందిన ఎకరం 30 గుంటల భూమిని తన పేరుమీద 2011లో రిజిస్ట్రేషన్ చేయించారని అప్పటినుంచి మ్యుటేషన్ చేయాలని ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితురాలు స్వరూప వాపోయారు. ఈ మధ్యకాలంలో పహాణీలో తన తండ్రి పేరును తొలగించి వేరే వాళ్ల పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేశారని అన్నారు. వేరే వ్యక్తి తమ భూమిలో గత కొన్ని రోజులుగా దున్నుతున్నాడని, పోలీసులను ఆశ్రయిస్తే వారు కూడా తమను, తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

తమకు న్యాయం చేసేంతవరకు తహసీల్దార్ కార్యాలయంలోనే ఉంటామని లేకుంటే కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని పెట్రోల్ సీసాతో ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బాధితులకు నచ్చజెప్పడంతో తండ్రీ కూతుళ్లు ఆందోళన విరమించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.