యాప్నగరం

కోడలి కాపురం కోసం మామ ఆత్మహత్య

కోడకుకు పెళ్లి చేశాడు. అయితే కోడలు కొడుకు గొడవలు పడ్డారు. ఈ క్రమంలో కోడలు పుట్టింటికి వెళ్లిపోయింది. ఎంత బతిమాలినా అత్తారింటికి రానని తేల్చేసింది.

Samayam Telugu 26 Nov 2020, 8:44 am
కోడలి కోసం మామ ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కోడలు కాపురానికి రావడం లేదని ఓ మామా మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొడుకుతో గొడవ పడ్డ కోడలు పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తారింటికి ఇక రానని చెప్పడం, బంధువుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆయన చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.
Samayam Telugu కోడలి కోసం మామ ఆత్మహత్య
father in law suicide


Read More : సనత్ నగర్ అభ్యర్థికి కరోనా పాజిటివ్.. ఆందోళనలో ఇతర నాయకులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటలో నివాసం ఉంటున్న నోముల వెంకటేశ్ ఇంట్లో గత కొద్ది రోజులుగా గొడవలు జరుతున్నాయి. కన్న కొడుకు పెండ్లి చేసిన భార్యభర్తల మధ్య గొడవలతో వారిద్దరు దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కోడలు పుట్టింటి వద్దనే ఉంటుంది. కోడలు కాపురానికి రావాలంటూ ఎన్నిసార్లు చెప్పినా మాట వినలేదు. ఇదే వ్యవహారంపై పెద్దరికం వహించిన నోముల వెంకటేశ్ కోడలిని అత్తారింటికి రావాల్సిందిగా కోరాడు.

కుటుంబం పెద్దలు, చుట్టుపక్కల వాళ్లు కూడా కోడలికి నచ్చచెప్పారు. కాపురానికి వెళ్లాల్సిందిగా కోరారు. అయితే, అతని కొడుకు ప్రవర్తన నచ్చలేదని కోడలు చెప్పేసింది. అత్తారింటికి రానని తేల్చేసింది. ఈ విషయంలో కోడలి తరఫు బంధువులు వచ్చి నోముల వెంకటేశ్ ఇంటి వద్ద గొడవకు దిగారు. దీంతో కుటుంబ తగాదాలతో తీవ్ర మనస్తాపంకు గురైన వెంకటేష్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో నిండిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.