యాప్నగరం

గ్రామంలో కరోనా ఫైట్.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

గ్రామంలో రెండు వర్గాలు గొడవకు దిగాయి. కరోనా మీ వల్ల వచ్చిందంటూ ఓ వర్గం వేరే వర్గం వారి ఇంట్లోకి వెళ్లి దాడికి దిగింది. ఈ దాడిలో పలువురుకి గాయాలయ్యాయి.

Samayam Telugu 28 Aug 2020, 11:21 am
కరోనా వైరస్ రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కంటికి కనిపంచని ఈ వైరస్ అనేక దారుణాలకు తెరతీస్తుంది. కరోనా కారణంగా ఆత్మహత్యలు, హత్యలు జరిగాయి. భయంతోనే సగం మంది చచ్చిపోతున్నారు. తండ్రికి వచ్చిందని కొడుకు, కొడుకుకు వచ్చిందని తండ్రి బాధతో భయంతో చనిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఒకరికి కరోనా వచ్చిందని ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటనలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగాయి. మనుషుల్ని ఇంతలా పట్టి పీడిస్తున్న కరోనా తాజాగా నిన్నమొన్నటి వరకు కలిసున్న ఇరుగు, పొరుగు మధ్య కూడా చిచ్చు పెడుతోంది.
Samayam Telugu కరోనా ఫైట్
corona fight


తాజాగా మీవల్లే కరోనా వచ్చిందంటూ ఓ గ్రామంలో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నరసింహపురంలో జరిగింది. గ్రామంలో కరోనా మీ వలనే మాకు వచ్చిందన్న అనుమానంతో రెండు వర్గాల వారు ఇళ్ళలోకి వెళ్లి మరి దాడులు చేసుకున్నారు. మాకు కరోనా లేదని చెప్పిన వినకుండా మహిళలు పిల్లలపై కర్రలతో దాడి చేసుకున్న వైనం ఈ దాడిలో ఇరు వర్గాల వారికి స్వల్పంగా గాయాలు అయ్యాయి, ఇరు వర్గాల వారు చింతకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దింతో పోలీసులు రెండు వర్గాలకు చెందిన వారిమీద కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.