యాప్నగరం

వడ్ల బస్తాల మీద కూర్చొని.. రైతుల కష్టాలు తెలుసుకొని.. హరీశ్ రావు సింప్లిసిటీ ఇది!

ఆయనో మంత్రి కానీ... బయటకు వెళ్తే నలుగురిలో ఒకడిలా కలిసిపోతారు. ఎలాంటి భేషజాలకు పోకుండా ఉన్న దాంట్లో సర్దుకుపోతారు. సమస్యల పరిష్కారం తప్ప తాను మరేదీ పట్టించుకొనని హరీశ్ రావు మరోసారి చాటారు.

Samayam Telugu 15 Nov 2019, 11:43 pm
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు సింప్లిసిటీకి అద్దం పట్టే ఘటన ఇది. హరీశ్ రావు మాస్ లీడర్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్లినా జనంలో ఒకడిగా కలిసిపోయే ఆయన.. తాను మంత్రినని.. పెద్ద నాయకుణ్ని అనే భావనను దరి చేరనీయరు. శుక్రవారం ఆందోల్ నియోజకవర్గంలోని పుల్కల్ మండలం గొంగ్లూరు వెళ్లిన ఆయన.. గ్రామ కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Samayam Telugu harish rao sits on paddy bag


రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న హరీశ్ రావు.. అక్కడే ఉన్న వరి బస్తాలపై కూర్చొని వారితో ముచ్చటించారు. ధాన్యం బస్తాలు కుట్టే సూదుల లేకపోవడం పట్ల స్పందించిన ఆయన.. చైర్మన్ సాబ్.. రైతుల్ని తిప్పలు పెడతావయ్యా. మళ్లీ దుకాణం కోసం జోగిపేట పోయి రావాల్నా.. ఏడేళ్లపాటు ఇచ్చి ఇప్పుడు తిప్పలు పడతారా. సూదులు తెప్పించడని మంత్రి సూచించారు.
హమాలీలు బిల్లులు తమ ఖాతాలో జమకావడం లేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా… సంబంధించిన అధికారులకు ఫోన్ చేసిన ఆయన.. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.