యాప్నగరం

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు

పటాన్‌చెరు మండలంలోని పాశమైలరం వద్ద కెమికల్ ఫ్యాక్టరీలో శనివార తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో ముగ్గురు కార్మికులు గాయపడగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

Samayam Telugu 17 Aug 2019, 9:55 am
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవిచింది. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున రసాయనాలు నిల్వ ఉండటంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీ మొత్తానికి వ్యాపించాయి.
Samayam Telugu Fire


అగ్నిప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో మూడు కంపెనీలకు వ్యాపించాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు కంపెనీల యజమాలు తెలిపారు.

కంపెనీలు ఉన్న ప్రదేశంలో నీటి కొరత ఉండటంతో సహాయక చర్యలకు ఆలస్యం అయింది. సమాచారం అందుకున్న 5 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.