యాప్నగరం

గోషామహల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున వాహనాలు దగ్ధం

Goshamahal: అయితే, అగ్ని ప్రమాదం కచ్చితంగా ఏ కారణం వల్ల జరిగిందన్న అంశం తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Samayam Telugu 6 Mar 2020, 10:56 am
హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీసు గ్రైండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం తలెత్తింది. శుక్రవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం సంభవించింది. మంటలు అంటుకొని మైదానంలో నిలిపి ఉంచిన దాదాపు 30 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. మంటల్లో కాలిపోయిన వాహనాల్లో ఎక్కువగా ద్విచక్రవాహనాలు, కార్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇవన్నీ పోలీసులు గత కొంత కాలంగా వివిధ కేసుల్లో సీజ్ చేసినవని అధికారులు చెప్పారు.
Samayam Telugu ad45cb49-26c7-485f-9d8c-b126a24e3fd9.


అయితే, అగ్ని ప్రమాదం కచ్చితంగా ఏ కారణం వల్ల జరిగిందన్న అంశం తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.