యాప్నగరం

మంటల్లో చిక్కుకున్న స్కూలు వ్యాను.. లోపల 10 మంది..

Narayanpet: వ్యాన్‌ బయల్దేరిన కాసేపటికే మార్గమధ్యలో ఇంజిన్‌లో నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌.. వ్యాన్‌ను ఆపి విద్యార్థులను, ముగ్గురు ప్రయాణికులను ప్రాణాలతో కాపాడారు. అగ్నిప్రమాదం కారణంగా వ్యాన్‌ పూర్తిగా దగ్ధమైంది.

Samayam Telugu 8 Feb 2020, 11:49 am
నారాయణపేట జిల్లా నర్వ మండలంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కుమార్ లింగంపల్లి గ్రామానికి చెందిన కొంతమంది పాఠశాల విద్యార్థులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. విద్యార్థులు ఓ వ్యాన్‌లో స్కూలుకు వెళ్తుండగా మార్గ మధ్యలో వాహనం తగలబడింది. ఆ సమయంలో వ్యాన్‌లో ఏడుగురు విద్యార్థులు, మరో ముగ్గురు సాధారణ ప్రయాణికులు ఉన్నారు. స్కూలు ఆత్మకూరులో ఉన్న పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు గమనించిన డ్రైవర్ వ్యాన్‌లో ఉన్న విద్యార్థులు, ప్రయాణికులను హుటాహుటిన దింపేశారు.
Samayam Telugu Car on Fire2
Representative Image


వ్యాన్‌ బయల్దేరిన కాసేపటికే మార్గమధ్యలో ఇంజిన్‌లో నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌.. వ్యాన్‌ను ఆపి విద్యార్థులను, ముగ్గురు ప్రయాణికులను ప్రాణాలతో కాపాడారు. అగ్నిప్రమాదం కారణంగా వ్యాన్‌ పూర్తిగా దగ్ధమైంది. ఘటనకు గురించిన గ్రామస్థులకు సమాచారం అందగానే అంతా ఆందోళనతో అక్కడికి చేరుకున్నారు. తమ పిల్లలు పెనుప్రమాదం నుంచి బయటపడి, పక్కనే సురక్షితంగా ఉండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, ఇంజిన్‌లో మంటలు తలెత్తినందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాను డ్రైవర్, యజమానిని ప్రశ్నిస్తున్నారు.

Also Read: కేంద్రమంత్రి పీఏ అని నమ్మించి మోసాలు.. సంతకం ఫోర్జరీ

Also Read: రెండు రోజులు వర్షాలు.. వాతావరణ అధికారుల వెల్లడి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.