యాప్నగరం

హన్మకొండ : ప్రముఖ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు

నగరంలోని ప్రముఖ హోటల్‌లో రాత్రి వేళ అగ్ని ప్రమాదం జరిగింది. కిచెన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

Samayam Telugu 19 Jan 2022, 8:30 am

ప్రధానాంశాలు:

  • హన్మకొండలోని త్రీస్టార్ హోటల్లో అగ్నిప్రమాదం
  • రాత్రి వేళ ఎగసిపడిన మంటలు
  • తప్పిన పెను ప్రమాదం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu హోటల్‌లో మంటలు
suprabha hotel
హన్మకొండలోని ప్రముఖ హోటల్‌లో అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వేళ మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. జడ్పీ చైర్‌పర్సన్ గుండు సుధారాణికి చెందిన హోటల్ సుప్రభలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్ వెనుక భాగంలో ఏసీ పైపులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. క్రమంగా మంటలు కిచెన్ రూమ్‌కి వ్యాపించడంతో భారీగా పొగలు వచ్చాయి. మంటలు కిటికీల్లో నుంచి ఎగసిపడ్డాయి. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుని హోటల్‌లో ఉన్న వారు బయటికి రావడంత పెనుప్రమాదం తప్పింది.
అప్రమత్తమైన హోటల్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. హోటల్‌‌లో అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందా? లేక కిచెన్ రూమ్‌లో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించిందా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. కిచెన్‌లో మంటలు చెలరేగి ఏసీ పైపులకు అంటుకుని ఉంటాయని భావిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సకాలంలో స్పందించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.