యాప్నగరం

జీడిమెట్ల: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు

Hyderabad: జీడిమెట్లలోని ఓ రసాయన పరిశ్రమ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ డ్రమ్ములు మంటలతో భారీ శబ్దాలు చేస్తూ ఎగిరిపడుతున్నాయి. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు.

Samayam Telugu 28 May 2020, 11:02 pm
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో ఓ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. పరిశ్రమలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. జీడిమెట్ల ఫేజ్-5లోని కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన గోదాంలో గురువారం (మే 28) రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మంటల తీవ్రతకు రసాయన డ్రమ్ములు పేలుతూ భారీ శబ్దాలతో ఎగిరిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంటలతో ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది.
Samayam Telugu రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
Chemical Factory Fire accident


సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. పేట్‌బషీర్‌బాద్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: వలస కూలీల కన్నీటి వెతలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.