యాప్నగరం

యాదాద్రి జిల్లాలో తొలి కరోనా మరణం.. బాలింతను బలి తీసుకున్న మహమ్మారి

యాదాద్రి జిల్లా రాజపేటకు చెందిన ఓ బాలింత కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో ఆమె చనిపోయింది.

Samayam Telugu 3 Jun 2020, 11:07 am
యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. రాజపేట మండలానికి చెందిన ఓ బాలింత హైదరాబాద్‌ ఉస్మానియా హాస్పిటల్‌లో మరణించింది. అనంతరం ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. నెలలు నిండకుండానే ఆమె బాబుకు జన్మనివ్వగా.. పుట్టిన కాసేపటికే చిన్నారి చనిపోగా.. చికిత్స పొందుతూ బాలింత కూడా ప్రాణాలు వదిలింది. కరోనాతో బాలింత మరణించిన విషయం తెలియగానే స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. మృతురాలి భర్త, ఏడాదిన్న వయసున్న పాపతోపాటు.. మరో ఏడుగురు ప్రైమరీ కాంటాక్టులను బీబీనగర్‌లోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.
Samayam Telugu నమూనా చిత్రం
coronavirus death


ఆమె తల్లిగారిది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కావడంతో ఆ ఊళ్లోనూ 8 మందిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ఆమె మే 27న జనగామలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోగా.. రక్తం తక్కువగా ఉందని తేలింది. దీంతో మే 31న హన్మకొండ తీసుకెళ్లారు. తెల్ల రక్త కణాలు తక్కువగా ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాబు జన్మించగా... పుట్టిన కాసేపటికే మరణించాడు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం బాలింత చనిపోయింది. కరోనా టెస్టులు చేయగా.. పాజిటివ్‌ అని తేలిందని డాక్టర్లు తెలిపారు.

మృతురాలి భర్తతో కాంటాక్ట్ అయిన 13 మందిని, ఆమె తల్లిగారి ఊళ్లో 8 మందిని హోం క్వారంటైన్లో ఉంచారు. మృతురాలు నివసించిన గ్రామంలోని కాలనీని కంటైన్మెంట్‌ ఏరియాగా ప్రకటించారు. ఊళ్లోని ప్రతి ఒక్కరూ 14 రోజులపాటు స్వీయ నిర్బంధం పాటించాలని చాటింపు వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.