యాప్నగరం

తెలంగాణలో తొలి కరోనా మృతి.. 67కు చేరిన కోవిడ్ కేసులు

Covid-19 Death in Telangana | తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైంది. గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది.

Samayam Telugu 28 Mar 2020, 10:47 pm
తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అనారోగ్యం బారిన పడిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. తర్వాత శాంపిళ్లను సేకరించి పంపగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు న్యూమోనియాతో చనిపోయాడని ఈటల తెలిపారు. ఆయనకు ట్రావెల్ హిస్టరీ ఉందని తేలడంతో పరీక్షలు నిర్వహించామన్నారు. పాత బస్తీలో ఒకే కుటుంబానికి చెందిన మరో ఐదుగురికి కోవిడ్ సోకిందని ఈటల తెలిపారు. చనిపోయిన వ్యక్తి, ఈ ఐదుగురితో కలిపితే.. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 67కు చేరిందన్నారు. నిజామాబాద్‌లో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ సంఖ్య 67కు చేరింది.
Samayam Telugu corona etela


శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఈటల.. కరోనా వైరస్ గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని కోరారు. ఒకే కుటుంబంలో ఎక్కువ కేసులు నమోదు కావడం వల్లే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు. శనివారం కేరళలోనూ తొలి కరోనా మరణం నమోదైన సంగతి తెలిసిందే. కొచ్చిన్‌కు చెందిన 69 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా ప్రాణాలు వదిలాడు. దీంతో భారత్‌లో కోవిడ్ మరణాల సంఖ్య 21కి చేరింది.

ఢిల్లీ వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకిందన్న ఈటల.. ఆయన వల్ల మరో 8-9 మందికి కోవిడ్ సోకిందని తెలిపారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రార్థన మందిరాలు, చర్చిలు, దేవాలయాలు కరోనా వ్యాప్తికి దోహదం చేయొద్దని ఆయన సూచించారు. ఓల్డ్ సిటీలో ఒక కుటుంబం, నాంపల్లి మరో కుటుంబం, కుత్బుల్లాపూర్ ఫ్యామిలీకి ట్రావెల్ హిస్టరీ ఉందన్నారు.

Read Also: ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. ఒంగోలు దంపతులకు కోవిడ్

Read Also: కరోనా సోకిందనే భయంతో.. సూర్యాపేటలో వ్యక్తి ఆత్మహత్య

Read Also: కరోనాపై యుద్ధం.. పీఎం కేర్స్ ఫండ్‌కు సాయం చేయండిలా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.