యాప్నగరం

కరీంనగర్‌లో ఘోర ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు మృతి

కరీంనగర్‌ సమీపంలో రాజీవ్ జాతీయరహదారి మరోసారి రక్తమోడింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఐదుగుర్ని బలితీసుకుంది. టాటాఎస్‌ను ఓ భారీ వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Samayam Telugu 9 Feb 2020, 8:28 am
కరీంనగర్‌లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న టాటా‌ఏస్ వాహనాన్ని భారీ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం గంగాధర మండలం కురిక్వాల గ్రామం వద్ద శనివారం రాత్రి 11.30 గంటల తర్వాత చోటుచేసుకుంది. గ్రానైట్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి టాటాఏస్‌‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై తక్షణమే స్పందించిన స్థానికులు అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu karnata


మృతులు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్‌కు చెందిన మేక బాబు, నర్సయ్య, అంజయ్య, మేక శేఖర్‌గా గుర్తించారు. ఆటో కరీంనగర్ నుంచి పూడూర్‌కు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. వ్యాన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని అరగంట పాటు శ్రమించి పోలీసులు బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. ఘటన తర్వాత లారీని వదిలి డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు.

లారీ ఢీకొట్టిన తర్వాత ఆటో ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ ఇంజన్‌ భాగంలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. మరొకరు ఆటోలో నుంచి ఎగిరి కింద పడి మృతి చెందగా మరొకరు నకభాగంలో మృతి చెందాడు. ఇద్దరు తీవ్రంగా గాయపడగా పోలీసులు, స్థానికులు కరీంనగర్‌‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ ఇద్దరూ అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.