యాప్నగరం

తెలంగాణలో మరో దారుణం .. ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ దారుణ హత్య

ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి కనిపించకుండా పోయాడు. 15 రోజుల వరకు పోలీసులకు సైతం చిన్నారి ఆచూకీ దొరకలేదు. చివరకు అనుమానం వచ్చి ఇంటి ఎదురుగా ఉన్న యువకుడ్ని విచారించడంతో అసలు విషయం బయటపెడింది.

Samayam Telugu 26 Oct 2020, 2:16 pm
తెలంగాణలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో బాలుడు కిడ్నాప్ హత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్ షామిర్‌పేటలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 15 లక్షల కొరకు బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలో బయట పడింది. ఇప్పటికే ఈ కేసులో యువకుడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. ఈనెల 15న ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల అదియాస్‌ అదృశ్యం అయ్యాడు. దీంతో అదే రోజు అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Samayam Telugu చిన్నారి కిడ్నాప్ హత్య
child death in shameerpet


మిస్సింగ్ కేస్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అయితే బాలుడు అదృశ్యమై పది రోజులు కావస్తున్నా నప్పటికీ ఎలాంటి సమాచారం పోలీసులకు చిక్కలేదు. చివరకు బాలుడి ఇంటి ఎదురుగా ఉన్న ఒక యువకుడిపైన పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో యువకుడిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించారు. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే టిక్ టాక్ ఆడుతున్న సమయంలో బాలుడికి గాయమై కిందపడిపోయి చనిపోయాడని దీంతో తాను బాలుడి మృతదేహాన్ని తీసుకొని వెళ్లి శామీర్పేట నిర్మానుష్య ప్రాంతంలో పడ వేసినట్లుగా పోలీసుల ముందు యువకుడు చెప్పాడు.

Read More: దసరా రోజున.. మహిళా సర్పంచ్‌పై దాడి

దీంతో బాలుడి ఆస్తి పంజరాన్ని ఇవాళ పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అయితే బాలుడి కిడ్నాప్ , హత్య వెనుక ఉన్న అసలు కథలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొన్నిరోజుల క్రితం మహబూబాబాాద్ జిల్లలో జర్నలిస్టు కుమారుడు దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ అయి హత్యకు గురవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.